నిందితులు గొప్పింటివాళ్లు అయితే ఎన్‌కౌంటర్ చేస్తారా? : మంచు లక్ష్మీ

శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:51 IST)
దిశ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సినీ నటి మంచు లక్ష్మీ స్పందించింది. ముఖ్యంగా, నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారన్న వార్త తెలియదానే ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు పేల్చడం చూస్తే ఈ సమాజం ఎక్కడిపోతుందనే భయం నెలకొందన్నారు. 
 
ఎందుకంటే.. మనం ఒక చట్ట పరిధిలో ఉన్నామన్నారు. ఆ చట్టాలపై మనకు అపారమైన గౌరవమర్యాలు ఉన్నాయన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే ఆ చట్టాల ద్వారానే పరిష్కారం కనుగొంటున్నామన్నారు. కానీ, ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరు, తాను కూడా స్వాగతించామన్నారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపు జరగపోయే పరిస్థితిని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదన్నారు. నిజానికి దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ ఈ జన్మకు తీరనిదన్నారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైగ, ఇలాంటి కేసుల్లో నిందితులు గొప్పింటివాళ్లు ఉన్నట్టయితే ఎన్‌కౌంటర్లు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు