''గుర్తుందా శీతాకాలం'' ఆగిపోలేదు.. మేఘా ఆకాష్ యాడ్ అయ్యింది..

గురువారం, 5 నవంబరు 2020 (20:27 IST)
టాలెంటెడ్‌ యాక్టర్‌ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో అచ్చమైన తెలుగు టైటిల్‌తో "గుర్తుందా శీతాకాలం'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఆడియోని ఫ్యాన్సీ ఆఫర్‌తో కన్నడలో నెం.1 ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 
అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన తరుణంలో.. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ ఒక పోస్టర్‌ విడుదల చేసి అలాంటి పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌ని ప్రకటించి.. సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు చిత్రయూనిట్‌. ఈ చిత్ర షూటింగ్‌ని నవంబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
 
అలాగే నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్‌, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ యాడ్‌ అవుతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నితిన్‌తో 'లై', 'చల్‌ మోహన్‌ రంగా' చిత్రాలలో నటించి, నితిన్‌ హీరోయిన్‌గా పేరు పొందిన మేఘా ఆకాష్‌ ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు