నివేత థామస్ థియేట‌ర్లో సినిమా చూస్తోంది!

శనివారం, 10 ఏప్రియల్ 2021 (17:34 IST)
NIvetha
వ‌కీల్‌సాబ్‌లో కీల‌క పాత్ర‌ధారిణి క‌థంతా ఆమెచుట్టూనే తిరిగే ప‌ల్ల‌వి (నివేద‌) రిలీజ్ ముందు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌నీ, ప్ర‌మోష‌న్‌కు రాలేదు. కాగా, ప్ర‌స్తుతం ఆమె థియేట‌ర్‌లో సినిమా చూస్తోంది కూడా. అదెలాగంటే, నివేదాకు నెగెటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. అందుకే ఆమెకు ఫ్రీడ‌మ్ వ‌చ్చిన‌ట్లుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే కొంద‌రు వెబ్‌సైట్ల‌లో త‌న‌కు త‌గ్గ‌కుండా థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న‌ట్లు పెట్ట‌డం ప‌ట్ల అభ్యంత‌రం తెలిపింది. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు వున్నాయ‌ని డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళాను. ఐసోలేష‌న్‌లో ముందు జాగ్ర‌త్త‌గా వున్నాను. ఇప్పుడు అంతా బాగానేవుంది. ఎటువంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని చెప్పింది.
 
శ‌నివార‌మే ఆమె హైద‌రాబాద్ చేరుకుంది. చిత్ర యూనిట్‌తో ప‌లు థియేట‌ర్ల‌ను ప‌ర్య‌టిస్తుంది. ఈరోజు రాత్రి ఏడున్న‌ర‌ల గంట‌ల‌కు ఆర్‌.టిసి. క్రాస్‌రోడ్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు సంద‌ర్శించ‌నుంది. ఆమెతోపాటు చిత్ర యూనిట్ అంతా రానుంది. అంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిన‌హా అంజ‌లి, అన‌న్య‌, నివేద‌, నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్‌, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్ ప‌రిస‌రాల్లో సంద‌డి నెల‌కొంది. మార్నింగ్ షో మొద‌లువ‌తుండ‌గా, మ‌ధ్య‌లో వారు వ‌చ్చి ఆడియ‌న్స్‌ను సంద‌రి చేయ‌నున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు