పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఎందుకో అందరూ ఆచార్య అంటారు.. (టీజర్)

శుక్రవారం, 29 జనవరి 2021 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి" అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక.
 
"ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం... అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. 
 
అంతేకాదు, తనను 'ఆచార్య' అనడం వెనుకున్న కాన్సెప్ట్‌ను‌ కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్‌లో చూడొచ్చు. పాఠాలు చెప్పే అనుభవం లేకపోయినా అందరూ నన్ను ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెబుతానని కాబోలు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 
 
కాగా, ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు. అలాగే, రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో కనిపించనున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు