వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం (వీడియో)

శనివారం, 30 సెప్టెంబరు 2017 (16:48 IST)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు, వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు.
 
నాలుగు మాఢా వీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథోత్సవం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు