భార్యాభర్తలను రోడ్డుపైనే కాల్చి చంపేసిన పోలీస్.. వీడియో వైరల్.. అసలేం జరిగింది..?

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (18:01 IST)
Cop
అసలేం జరిగింది..? ఇదే డౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాను చూసిన నెటిజన్లంతా అడిగే ప్రశ్న. సోషల్ మీడియాలో రోజుకో వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా వీడియో భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? నడిరోడ్డుపై భార్యాభర్తలను ఓ పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపేశారు. ఈ వీడియోపై సదరు పోలీస్ ఆఫీస్ వివరణ కూడా ఇచ్చారు. 
 
హర్యానాలోని ఓ కేఫ్ ముందు వున్న జంటను యూనిఫామ్‌లో ఉన్న పోలీస్‌ అధికారి తన చేతులో ఉన్న గన్‌తో కాల్చేశాడు. దీంతో వారిద్దరూ నేలపై పడిపోయారు. ఇది చూసిన చుట్టు పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో బాగా వైరల్‌ అవుతోంది. 22 సెకన్లున్న ఈ వీడియోను చూసి ఇది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అని చర్చించుకున్నారు. దీంతో ఈ వీడియో కాస్త చివరికి పోలీసు అధికారుల దృష్టికి చేరుకుంది. 
 
దీనిపై పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు ఇది ఒక ఫేక్‌ వీడియో అని తేల్చి చెప్పారు. ఆ వీడియోలో ఉంది నటీనటులు.. ఆ వీడియో ఓ వెబ్‌ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించదని పోలీసులు తేల్చారు. ఈ వీడియోను రాహుల్‌ శ్రీ వాస్తవ్‌ అనే పోలీసు అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియో ఓ వెబ్ సిరీస్ కోసం చిత్రీకరించబడిందని స్పష్టం చేశారు. ఈ వీడియోలో వున్న నటీనటుల పేర్లు శ్వేతా సిన్హా, దేవ్.. అంటూ వివరణ ఇచ్చారు.

#FactCheck- A video of a gory murder by a cop outside a restaurant is floating since today morning on #socialmedia, triggering queries & confusion.

On verification, it’s attributed to a #webseries shot outside ‘Friends Cafe’ in Karnal Haryana as per the manager of the Cafe. pic.twitter.com/63GHkScx9j

— RAHUL SRIVASTAV (@upcoprahul) April 12, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు