క్యూలో నిలబడమంటే.. రైల్వే పోలీసును చితక్కొట్టారు.. (Video)

బుధవారం, 19 జూన్ 2019 (14:25 IST)
క్యూలో నిలబడమని చెప్పినందుకు.. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. టిక్కెట్ కోసం నిల్చున్న ఓ యువకుడిని లైన్లో నిలబడమని చెప్పిన ఓ రైల్వే పోలీసుపై ఆ యువకుడు తీవ్రంగా దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. యూపీలోని తియోరియా సాదర్ రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కోసం ప్రయాణీకులు క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మాత్రం లైన్లో నిలబడకుండా క్యూ మధ్య దూరి టిక్కెట్లు తీసుకోవాలనుకున్నారు. 
 
దీన్ని గమనించిన ఓ రైల్వే పోలీస్ ఆ యువకులను లైన్లో నిలబడమని మందలించాడు. దీంతో పోలీసుతో ఆ యువకులు వాదనకు దిగారు. ఆపై పోలీసుపై యువకులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రైల్వే పోలీసుపై యువకుల దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#WATCH: A Government Railway Police (GRP) official thrashed by two men in Deoria yesterday after an argument broke out when the policeman asked them to stand in queue at the ticket counter. The two men have been arrested. (Note: abusive language) pic.twitter.com/Z2b5Fd4bi2

— ANI UP (@ANINewsUP) June 19, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు