ఈ బుడ్డోడు నా మనసు దోచాడు.. కేటీఆర్ ట్వీట్

శనివారం, 14 నవంబరు 2020 (15:58 IST)
Boy
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు చిన్నారులంటే చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇక 14 నవంబర్ 2020 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేటీఆర్.. ఆసక్తికరమైన ఫోటోను పోస్టు చేశారు. 
 
ఇంకా ఆ ఫోటో ద్వారా ప్రపంచంలో తనకు పిల్లలంటేనే చాలా ఇష్టమని చెప్పారు. నవ్వుతున్న కళ్లతో నవ్వుతున్న ముఖాలు అంటూ పలు ఫోటోలను పంచుకున్న ఆయన.. సనత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని కేటీఆర్‌ను ఫోటో తీస్తున్న ఫోటోను షేర్ చేశారు.
 
ఈ ఫోటోను అంతకుముందు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన ట్విటర్‌ పోస్టు చేయగా.. అదే ఫోటోను కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. 
 
ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి ఫోటో తీశాడు' అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు