యూజర్లకు జియో సర్ర్పైజ్ 'సిక్సర్'... ఉచితంగా మీకోసం అవన్నీ...

మంగళవారం, 4 జూన్ 2019 (20:39 IST)
రిలయెన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈసారి ఇది క్రికెట్ క్రీడాభిమానుల కోసం. అదేమిటంటే... ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ డేటా రూ. 251 రీఛార్జ్ చేసుకుంటే చాలు. వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా చూసేయవచ్చు. దీనితోపాటు జియో యూజర్లు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఏ టెలికామ్ ఆపరేటర్లో లేదు. యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుంచి హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం వుంటుంది.
 
ఇక డేటా రీచార్జ్ విషయానికి వస్తే... రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలు నిర్వహిస్తుంది. అందులో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు వుంటాయి. ఇంకెందుకాలస్యం... చేసేయండి జియో సిక్సర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు