కరోనా వైరస్ మూడో దశకు వెళితే ప్రమాదకరం, డాక్టర్ రణ్దీప్ గులేరియా, డైరెక్టర్, ఢిల్లీ ఎయిమ్స్
“వైరస్” వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా “పాజిటివ్” కేసుల సంఖ్యతో పాటు “వైరస్” సోకి మృతి చెందిన వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని, ఇక ఢిల్లీలోని “మర్కజ్” మత ప్రార్థనాల కారణంగానే దేశంలో “కరోనా” కేసులు విపరీతంగా పెరిగాయన్నారు.
ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో “లాక్డౌన్” ఎత్తివేయడం గురించి చెప్పలేమని, ఏప్రిల్ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తాం అన్నారు.