అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ను టీమిండియా సొంతం చేసుకుంది. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్.. నేటికి పూర్తయింది. ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు దుమ్ము దులిపేశారు. కేవలం మూడే రోజుల్లో మ్యాచ్ను ఫినిష్ చేసేశారు. ఏకంగా 140 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టీమిండియా 1-0 తేడాతో ముందువరుసలో ఉంది.