ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

ఆదివారం, 19 మార్చి 2017 (11:16 IST)
హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం ధోనీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా హోటల్‌లో దట్టంగా పొగలు వ్యాపించాయి. 
 
జార్ఖండ్ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరగనున్న విజయ్ హజారే ట్రోపీ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ ఆ హోటల్‌లో బస చేశాడు. ధోనీ వెంట దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్‌కు చెందిన మూడు ఫోన్లు పోయాయి. దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి