ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా భారత్ అపజయాల బాట పట్టడం, తనపై విమర్శలు చేయడంపై వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వారికి బ్యాటుతోనే సమాధానం చెప్పి.. భారత్ను విజయాల బాటకు నెట్టిన ధోనీ... ఈ మ్యాచ్లో తాను తప్పులు చేస్తే కత్తులు దూయాలని చాలామంది ఎదురుచూశారని వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్లో జట్టు ప్రదర్శన తనకు అంతగా సంతృప్తిని ఇవ్వనప్పటికీ, మొత్తం మీద మ్యాచ్ గెలవడం సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. చివరి ఓవర్లలో సింగిల్స్ తీయరాదని తాను ముందే నిర్ణయించుకున్నానని, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకునే ఆ పని చేశానన్నాడు.