టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తాను గాయానికి గురికావడంపై తొలి సారి స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాణాంతక గాయానికి గురైన విషయంపై సోషల్ మీడియా వేదికగా తన గాయానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను కోలుకునే ప్రక్రియలో ఉన్నానని, రోజు రోజుకి చాలా మెరుగవుతున్నానని వెల్లడించాడు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు.
వైద్య పరీక్షల్లో శ్రేయాస్ అయ్యర్కు అంతర్గత రక్త స్రావం అవుతుందని గ్రహించారు వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. రక్తస్రావం ఆగిపోవడంతో జనరల్ వార్డ్లోని ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. టీమిండియా ఫిజియోల వేగవంతమైన చికిత్స కారణంగా శ్రేయస్ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బీసీసీఐ చీఫ్ డాక్టర్ మీడియాకు తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడని కూడా చెప్పాడు.