పర్సనల్ కంప్యూటర్ పితామహుడు ఆర్నాల్డ్ స్పీల్ బర్గ్ ఇకలేరు

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:15 IST)
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తండ్రి, పర్సనల్ కంప్యూటర్ పితామహుడు, టెక్నాలజీ రంగ నిపుణుడుగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ స్పీల్ బర్గ్ ఇకలేరు. ఆయన 103 యేళ్ల వయస్సులో వద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తండ్రి 103 యేళ్ల వయస్సులో ప్రశాంతంగా కన్నుమూశారని స్టీవెన్ స్పీల్ బర్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, 1970, 1980 దశకాల్లో పీసీలు అందుబాటులోకి వచ్చాయంటే, 1950లో ఆర్నాల్డ్ చేసిన కృషే కారణమని చెప్పొచ్చు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థలో పనిచేస్తూ, సహోద్యోగి అయిన ప్రాప్‌ స్టర్‌తో కలిసి 'స్పీల్ బర్గ్ జీఈ-225' అనే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్‌ను తయారు చేశారు. 
 
ఈ స్ఫూర్తితోనే 'బేసిక్' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డార్ట్ మౌత్ కాలేజ్ పరిశోధకులు తయారు చేశారు. ఈ లాంగేజ్వ్ సాయంతోనే ఆపై కంప్యూటర్లు తయారు అయ్యాయి. 1917లో జన్మించిన ఆయన, తన సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. యూఎస్‌లోని సిన్సినాటి ప్రాంతానికి వలస వచ్చిన ఉక్రెయిన్‌కు చెందిన యూదు దంపతులకు ఆర్నాల్డ్ జన్మించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు