పారిస్ నుంచి ఈజిప్టుకు బయలుదేరిన ఫ్లైట్ అదృశ్యం.. 69 ప్రయాణికులు అంతేనా?

గురువారం, 19 మే 2016 (15:02 IST)
ఈజిప్ట్ ఎయిర్ ఫ్లయిట్ సంస్థకు చెందిన విమానమొకటి అదృశ్యమైంది. ఈ విమానంలో మొత్తం 69 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్ట్‌కు బయలుదేరింది. పారిస్ నుంచి సుమారు మూడు గంటల 44 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఆ ప్లేన్ అదృశ్యమైంది. 
 
ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి రాడార్ సిగ్నల్స్‌కు ఆ విమానం ఆచూకీ చిక్కలేదు. సుమారు 37 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఎయిర్‌బస్ ఏ320 రాడార్ నుంచి మిస్సైనట్లు అధికారులు తెలిపారు. ఈజిప్ట్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన 10 నిమిషాలకు ఆ ఫ్లయిట్ ఆచూకీ లేకుండాపోయింది. కనిపించకుండాపోయిన విమానం కోసం గాలింపు చేపట్టాలని ఈజిప్ట్ ఎయిర్ సంస్థ ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి