నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబయిపై చేసిన దాడుల్లో 166 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే తాయిబా సీనియర్ కమాండర్ అయిన జకీ-ఉర్-రెహ్మాన్ లక్వీ ప్రస్తుతం పాకిస్థాన్లోని రావల్పిండి జైల్లో ఉన్నాడు. ఈ కిరాతకుడికి పాక్లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది.