పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం భారత్ను సందర్శించనుంది. ఇరు దేశాల మధ్య నెలకొనివున్న వివిధ సమస్యల పరిష్కార కృషిలో భాగంగా ఇరుదేశాల పార్లమెంటేరియన్ల మధ్య ప్రారంభమైన చర్చల ప్రక్రియకు కొనసాగింపుగా 19మంది సభ్యుల పాక్ పార్లమెంటరీ బృందం ఈ 17వ తేదీన భారత్కు రానుంది.
పాకిస్థాన్లోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఈ బృందం, భారత పార్లమెంటేరియన్లతో ఢిల్లీలో 18, 19 తేదీలలో సమావేశమంకానుంది. ఈ రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు గత జనవరిలో ఇస్లామాబాద్లో జరిగాయి.
పాకిస్థాన్కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. పాక్ సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ జాన్ మహమ్మద్ ఖాన్ జమేలీ, పాక్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఫైజల్ కరీం కుండీ పాకిస్థాన్ బృందానికి నాయకత్వం వహిస్తారు.