షావోమీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర అంచనా రూ. 42,400

గురువారం, 19 మార్చి 2020 (18:36 IST)
Mi 10
షావోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి 5జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ను మార్చి 31న మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. ఈ ఫోనును పొందాలనుకునేవారు.. ఏప్రిల్ ఏడవ తేదీ రాత్రి 11.59 గంటలకు ఫ్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని మను కుమార్ జైన్ వెల్లడించారు. ఈ ఫోన్ అమేజాన్ ఆన్‌లైన్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. 
 
5జీ ఎంఐ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల సంగతికి వస్తే...?
2 జీబీ ర్యామ్‌, 
512 స్టోరేజ్‌, 
8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభ్యంకానుంది. 
ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. 
యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్‌ బ్యాక్‌ సదుపాయం. 
డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్‌ సదుపాయాన్ని వినియోగదారలకు లభ్యం కానుంది. 
 
6.67 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 10
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌
20 ఎంపీ సెల్పీ కెమెరా
108+13+ 2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమరా
4780 బ్యాటరీ సామర్థ్యం
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు