వివాహేతర సంబంధం ఓ చిన్నారి బలైంది. పరాయి పురుషునితో రాసలీలలు జరిపేందుకు కన్నబిడ్డ అడ్డొస్తుండటంతో ఆ కసాయి తల్లి అతన్ని హతమార్చింది. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... నాందేడ్కు చెందిన భారతీ బాబురావ్ షిండే (35) అనే మహిళకు ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త రెండేళ్ళ క్రితం మరణించాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి చిన్న కుమారునితో ముంబైకి వచ్చి జీవనం సాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కుమార్ అనే భూస్వామితో ఏర్పడిన పరిచయం.. వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే, భారతీ బాబురావ్ షిండే తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతోంది. ఆ సమయంలో మూడేళ్ళ బిడ్డ విషయం ప్రస్తావన వచ్చి.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన భారతీ.. తమ బంధానికి కన్నబిడ్డ అడ్డొస్తున్నాడని భావించి.. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టింది. ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే కన్నుమూసినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భారతీని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.