అన్నమయ్య పద కవితలు ఆలపించిన స్రవంతి

శనివారం, 22 నవంబరు 2014 (20:28 IST)
ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య విన్నపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ క్రిష్టారావు కుమార్తె కుమారి ఐ.స్రవంతి భక్తులకు వినిపించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్రవంతి సంగీత కార్యక్రమాన్ని చేశారు. 
 
స్రవంతి శేషయ్య శాస్త్రి వద్ద సంగీత సాధన చేశారు. పద కవితా పితామహుడు అన్నమయ్య ఆలపించిన కీర్తనలు ఆమె భక్తులకు వినిపించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణారావు, మాజీ ఎంపి చింతా మెహన్ తదితరులు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి