చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు మాతృవియోగం కలిగింది. ఆనంద్ తల్లి సుశీల (89) బుధవారం నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చదరంగంలో తల్లే ఆనంద్కు తొలి గురువు. ఆమె వద్ద నేర్చుకున్న పాఠాల పునాదే విషీని అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారుడిగా నిలిపింది. కాగా, ఆమె మృతికి అఖిల భారత చెస్ సమాఖ్య సంతాపం వ్యక్తం చేసింది.