పొట్టకూటి కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ యువకుడు కామాంధుడయ్యాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషను పరిధిలో పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజం చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఐతే బాలిక పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా అడగటంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడుపై పోక్సో చట్టం నమోదు చేసి అరెస్ట్ చేసారు. బాలికకు వైద్య పరీక్షల చేయించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ప్రస్తుతం బాలికకు చికిత్స అందిస్తున్నారు.
నన్ను ప్రేమించవా అంటూ బాలిక మెడపై కత్తి పెట్టిన ఉన్మాది
ఈమధ్య కాలంలో ప్రేమోన్మాదుల ఘాతుకాలు ఎక్కువవుతున్నాయి. మహారాష్ట్రలోని సితారాలో ఓ ప్రేమోన్మాది గత కొన్ని నెలలుగా పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఐతే ఆ బాలిక అతడిని తిరస్కరించింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. దాంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసేందుకు ఆమె వద్దకు వెళ్లాడు.
ఆమెపై కత్తితో దాడి చేసేందుకు యత్నిస్తున్న సమయంలో అక్కడ పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. ఇది గమనించిన అతడు తన దగ్గరకు వస్తే కత్తితో బాలికను చంపేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి సాహసించి సదరు ప్రేమోన్మాదిని పట్టుకున్నాడు. దీనితో మిగిలినవారంతా కలిసి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను రక్షించిన స్థానికులకు ఆమె తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేసారు.