ప్లీజ్.. అసత్య ప్రచారం చేయొద్దు... ఎస్పీబీ ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ క్లారిటీ

సోమవారం, 24 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు జరిగిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఖండించారు. దయచేసి.. అసత్య వార్తలు, రూమర్లు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, తాజాగా ఎస్పీబీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఎస్.పి. చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా ఐసీయూ వార్డులోనే ఎక్మో సపోర్టుతో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్.పి బాలు ఆరోగ్యం ఆ తర్వాత మరింతగా క్షీణించిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు