అప్పటి నుండి, వారు చాలాసార్లు కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, అతను ఆమెను చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇటీవల ఆమె తనను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు, అతను తప్పించుకోవడం ప్రారంభించాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు.
ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బహిరంగంగా వెల్లడిస్తానని శ్రీధర్ బెదిరించాడు. గురువారం మహిళ ఫిర్యాదు ఆధారంగా, మధురానగర్ పోలీసులు అత్యాచారం, మోసం కేసు నమోదు చేశారు. ఇంకా పరారీలో వున్న నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.