మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసిన ఘటనలో ఆ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రూప్లా తండాకు చెందిన జరుప్ల హోబ్యా, లావణ్య దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.