ఏపీలో కూటమిదే అధికారం: తెదేపా-జనసేన-భాజపాలకి 104 సీట్లు

ఐవీఆర్

శనివారం, 9 మార్చి 2024 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా కుదిరింది. దీనితో తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూటమి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది.
 
వైసిపి కేవలం 49 స్థానాలకే పరిమితమవుతుందనీ, మరో 22 స్థానాల్లో కూటమికి-వైసిపికి మధ్య గట్టి పోటీ వుండనుందని వెల్లడించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే... తెదేపా-జనసేన-భాజపాలకి 51.4 శాతం ఓట్లు వస్తాయనీ, వైసిపి 42.6 శాతం ఓట్లు గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో కూడా కూటమి మొత్తం 25 స్థానాలకు గానూ 18కి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది. తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్ లో వున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు