అప్రమత్తంగా ఉండండి.. అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే

శనివారం, 16 మే 2020 (16:15 IST)
మంగళగిరి సమీపంలోని తాడేపల్లి మున్సిపాలిటీలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దృశ్యా మంగళగిరి పట్టణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ కరోనా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)సూచించారు.

శనివారం మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన పట్టణంలో  కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు ఎప్పటికప్పుడు అన్ని వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేయించాలని అన్నారు.

ప్రజలు  భౌతిక దూరం పాటించేలా చూడాలని పేర్కొన్నారు. వలస కూలీలను సాధ్యమైనంత త్వరగా తమ స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ హేమమాలినీరెడ్డి, పట్టణ సిఐ శీలం శ్రీనివాసరెడ్డి,మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా మంగళగిరి పట్టణంలో మొత్తం 3 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఏపీఎస్పీ ఆర్ ఎస్ ఐ కరోనా పాజిటీవ్ కారణంగా చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు