ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ స్టేషన్లలోనే ఆగుతుంది..

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (08:57 IST)
భారతీయ రైల్వే శాఖ త్వరలోనే అమృత్ భారత్ పేరుతో సరికొత్త నాన్ ఏసీ రైళ్ళను పట్టాలెక్కించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైళ్ళకు పచ్చ జెండా ఊపనున్నారు. దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో నడిపే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీదుగా ప్రయాణించనుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా నుంచి బెంగుళూరు మార్గంలో ఒక రైలు నడుపనున్నారు. 
 
ఈ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రవేశించిన తర్వాత తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగి వెళుతుంది. ఈ రైలులో 12 స్లీపర్ బోగీలు, 8 జనరల్ బోగీలు, 2 గార్డు బోగీలు ఉంటాయి. వీటిలోనే దివ్యాంగులకు కొంత భాగాన్ని కేటాయించారు. ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ధీటుగా ఈ స్లీపర్ క్లాస్ రైళ్లను దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో నడుపనున్నారు. 
 
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల డబ్బులు చెల్లించేందుకు పోటీపడుతున్న వాహనదారులు...  
 
తెలంగా రాష్ట్రంలో వాహనదారులు తమ పెండింగ్ చలాన్లకు అపరాధం చెల్లించేందుకు పోటీపడుతున్నారు. దీనికి కారణం ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ విభాగం భారీగా రాయితీ ప్రకటించడమే. దీంతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష ఆదరణ లబిస్తుంది. గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.8.50 కోట్ల మేరకు ఫైన్ వసూలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోనే చెల్లించినట్టు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగర పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షలు చొప్పున ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతుండటంతో ఒక్కో సమయంలో సర్వర్ రూడా డౌన్ అవుతుంది. 
 
పెండింగ్ చలాన్లపై రాయితీపై ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, నాలుగు చక్రాలైన కార్లు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం చొప్పున రాయితీని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ... 
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు