టార్గెట్ రాయపాటి వారిద్దరి పనేనా..?

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:49 IST)
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు రాయపాటి సాంబశివరావు. ఎంపిగా కూడా పనిచేశారు. టిడిపిలో ముఖ్య నాయకులతో బాగా సన్నిహితం కూడా ఉంది. అలాంటి ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. కానీ ఎపి సిఎంతో పాటు బిజెపి గురించి కొన్ని చోట్ల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చివరకు చిక్కుల్లోకి నెట్టాయి. 
 
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాయపాటి ఇంటితో పాటు ఆయనకు చెందిన సంస్థలపైనా సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నిర్మాణ సంస్థలో రాయపాటికి వాటాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రుణాలను ఎగవేత వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
దీంతో సిబిఐ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు గత నెలరోజులుగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు బిజెపి నాయకులను బాగా విమర్శిస్తున్నారట. అది కెమెరాల ముందు కాదు. ఆయనకు బాగా తెలిసిన వ్యక్తుల వద్దే మాట్లాడుతున్నారట. ఇది సిఎంకు కోపం తెప్పించిందని చెప్పుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు