ఏపీకి రాజధాని లేదా.. నిజమా అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. దీంతో.. ఏపీకి చెందిన నేతలు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..!
అయితే.. కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది.