ఏపీలో కరోనా బస్సులు సిద్ధం.. 36 సీట్ల స్థానంలో 26 సీట్లు

బుధవారం, 13 మే 2020 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా రవాణాను పునరుద్ధరించే చర్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న లాక్డౌన్ తర్వాత ఈ ప్రజా రవాణా పునరుద్ధరించే అవకాశం ఉంది. 
 
అయితే, కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. ఖచ్చితంగా సామాజిక భౌతికదూరం పాటిస్తూనే, ముఖానికి మాస్క్ ధరించాల్సిన నిబంధన ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
 
ప్రయాణికుల మధ్య దూరం తప్పనిసరిగా ఉండాల్సిన నేపథ్యంలో మొత్తం 36 సీట్లలో 10 సీట్లను తగ్గించి, 26 సీట్లకు కుదించారు. ప్రయాణికులు నడిచే దారిలో 8 సీట్లను అమర్చారు. 
 
అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
 
అయితే, ఈ బస్సులో ప్రయాణ చార్జీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. పది సీట్లను తొలగించడం వల్ల తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా, అదనపు వడ్డనకు ఆర్టీసీ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు