హరికృష్ణ కుటుంబానికి దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి- పవన్ కల్యాణ్

బుధవారం, 29 ఆగస్టు 2018 (12:29 IST)
టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హరికృష్ణ మరణంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ లేఖను పోస్టు చేశారు. 
 
నల్గొండ దిల్లాలో రోడ్డు ప్రమాదానికి హరికృష్ణ గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడ్డారని అనుకునేలోపే.. విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని.. పవన్ తెలిపారు. 
 
హరికృష్ణ మృతి నేపథ్యంలో నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని పవన్ వ్యాఖ్యానించారు. పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు