అది పట్టుకున్నప్పుడు నువ్వు చూశావా? డిప్యూటీ సిఎంను ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు

ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:54 IST)
రఘురామక్రిష్ణరాజుకు కోపమొస్తోంది. ఆయన రోజుకో విధంగా ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. వైసిపి గుర్తుతో గెలిచిన రఘురామక్రిష్ణరాజు ప్రస్తుతం ఆ పార్టీ నేతలపైనే విమర్సలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు తనను విమర్సించే వారెవరినీ వదిలిపెట్టడం లేదు ఆ ఎంపి.
 
బిజెపితో పాటు టిడిపి ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే రఘురామక్రిష్ణరాజు పనిచేస్తున్నారని, వారు చెప్పినట్లే అధికార పార్టీపై లేనిపోని విమర్సలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఎంపి రఘురామక్రిష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
అది కూడా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఏకిపారేశారు. నిన్న ఎంపిపై ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ కాళ్ళు పట్టుకుని ఎంపి టిక్కెట్టు తెచ్చుకున్నారు రఘురామక్రిష్ణమరాజు. ఆయన ఎవరో కూడా జనానికి తెలియదు. 
 
మా పార్టీ గుర్తుతో గెలిచిన వ్యక్తి రఘురామక్రిష్ణరాజు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపి పదవికి రాజీనామా చేయాలన్నారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. దీంతో ఎంపికి కోపమొచ్చింది. ప్రెస్‌మీట్ పెట్టి డిప్యూటీ సిఎంను ఏకిపారేశారు. జగన్ కాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వు చూశావా అంటూ ప్రశ్నించారు.
 
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు డిప్యూటీ సిఎం, ముందు భజన చేయడం మానుకో, ఎవరు ఎంతటి వారో అందరికీ తెలుసు. నాపై మరోసారి విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డిప్యూటీ సిఎం, ఎంపి రఘురామక్రిష్ణరాజుల మధ్య జరిగిన మాటలయుద్ధం రాజకీయ చర్చకు దారితీస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు