అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:26 IST)
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరుతో ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా? లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే అంశాలతో పాటు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 
 
గురువారం వెల్లడైన ఈ సర్వే ఫలితాల మేరకు... ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లను, వైకాపా 8 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 45 శాతం ఓట్లు, వైకాపాకు 41.1 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మాత్రం ఈ సర్వే బహిర్గతం చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు