హైదరాబాద్ - బెంగళూరు రూట్‌‌లో సండే బాదుడు

గురువారం, 26 డిశెంబరు 2019 (12:22 IST)
హైదరాబాద్ - బెంగళూరు రూట్‌‌లో సండే బాదుడు మామూలుగా లేదు. ఈ మార్గంలో టికెట్ ధర రూ.950, ఆదివారం మాత్రం రూ.1,300 బెంగళూరు  - హైదరాబాద్ నడుమ నడిచే గరుడ ప్లస్ ఏసీ సర్వీస్‌‌ బస్సు చార్జీలను మారుస్తూ టీఎస్‌‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సోమవారం నుంచి శనివారం వరకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సు చార్జీ రూ.950 ఉంటే, ఆదివారం మాత్రం రూ.1300 ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌‌కు నడిచే బస్సు చార్జీ శనివారం నుంచి గురువారం వరకు రూ.950 ఉంటుందని, శుక్రవారం మాత్రం రూ.1300 ఉంటుందని తెలిపారు. తక్షణమే కొత్త చార్జీలు అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు