అక్రమ సంబంధాన్ని నిలదీసిందనీ... భర్త ఏం పని చేశాడో తెలుసా?

సోమవారం, 6 ఆగస్టు 2018 (08:48 IST)
పరాయి మహిళతో గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని భార్య నిలదీసింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన భర్త... కట్టుకున్న భార్యను చెట్టుకు కట్టేసి చితకబాది ఆ తర్వాత నిప్పుపెట్టాడు. ఈ దారుణం వరంగల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాకు చెందిన రజిత అనే మహిళ తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి నిలదీసింది. ఆ తర్వాత భర్తపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో పరాయి మహిళతో భర్త ఏకాంతంగా ఉన్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 
 
అంతే.. ఒక్కసారిగా ఆగ్రహానికిలోనైన భర్త.. రజితను చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. మం‍టల్లో కాలి తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు