ఉలిక్కిపడిన మదనపల్లె... ఎందుకు?

శనివారం, 13 జులై 2019 (06:57 IST)
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ఉలిక్కిపడింది. పట్టణ నడిబొడ్డున ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఆమె ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు.. వివాహితను అత్యంత కర్కశంగా నరికి చంపారు. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో తారకరామా సినిమా థియేటర్ వద్ద ప్యారా నగర్‌లో ఈ వివాహిత హత్య జరిగింది. పట్టణంలోని ఓ మసీదులో మత పెద్దగా పని చేస్తున్న అంజాద్ భార్య అయిన తహసీన్ (28)ను ఇంటిలోనే దుండగులు గొంతుకోసి చంపేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి చిదానంద రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు