నేనెవరో తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులపై వైసిపి నేత బండబూతులు, చెంపదెబ్బలు

శనివారం, 5 సెప్టెంబరు 2020 (19:16 IST)
కర్నూలు జిల్లా ఆదోనిలో రెచ్చిపోయాడు వైసిపి నేత కల్లుబోతు సురేష్ తన పనులు జరగడం లేదంటూ మండగిరి రెండు సచివాలయంలో వీరంగం సృష్టించాడు. డిజిటల్ అసిస్టెంట్ నగేంద్రను చెంపకేసి కొట్టాడు.
 
అంతటితో ఆగలేదు బండబూతులతో చెలరేగిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. అయితే ఉద్యోగస్తులు మూడవ పట్టణ పోలీస్టేషన్‌లో వైసిపి నేతపై ఫిర్యాదు చేశారు.
 
తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఫోన్లో మళ్ళీ ఉద్యోగస్తులను తిట్టడం ప్రారంభించాడు. అయితే స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు విషయం తెలుసుకుని పార్టీ పరువు పోతుందని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం వైసిపిలోనే పెద్ద దుమారం రేగుతోంది. సదరు వైసిపి నేత బూతుపురాణాలు, చెంప దెబ్బల వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు