మద్యం కొనాలంటే కార్డు కావాల్సిందే.. ధర రూ.5 వేలు!? జగన్ నిర్ణయం

గురువారం, 5 డిశెంబరు 2019 (13:41 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. ఈ నేపథ్యంలో ఇకపై మద్యం ఎవరైనా కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చేజ్ కార్డును తప్పనిసరిగా కొనుగోలు చేయాలట. ఈ కార్డు పొందాలంటే రూ.5 వేలు చెల్లించాల్సివుంటుంది. 
 
అంతేకాదండోయ్... మన మెుబైల్ ఫోనుకు రీచార్జ్ చేసినట్లు సంవత్సరం గడవగానే మళ్లీ రూ.5 వేలు పెట్టి రెన్వుయల్ చేయింసుకోవాలట. అదీ అందరికీ ఆ కార్డ్ ఇవ్వరట. 25 సంవత్సరాలు దాటి గుర్తింపు పొందిన హస్పిటల్‌లో పని చేసే వైద్యుడు వద్ద తనకు ఏ జబ్బూ లేదనీ ధృవీకరించేలా ఓ మెడికల్ సర్టిఫికేట్‌ను తీసుకుని సమర్పించినవారికే ఆ కార్డును ఇస్తారట. మొత్తంమీద జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు