కేజీహెచ్‌లో అడుగుపెడితే పదవి పోతుందా..? మరి సీఎం జగన్ పరిస్థితేంటి?

శుక్రవారం, 8 మే 2020 (19:11 IST)
1995లో ఎన్టీఆర్ కేజీహెచ్‌లో అడుగుపెట్టాక పదవి పోయిందని... ఆ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదని వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. మళ్లీ ఇప్పుడు జనాల కోసం వైస్. జగన్ అడుగుపెట్టారని వరప్రసాద్ చెప్పారు. 
 
జగన్‌కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని వరప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పదవులు ముఖ్యం కాదన్నారు. ఈ మేరకు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత మళ్లీ విశాఖ కేజీహెచ్‌లో అడుగుపెట్టారని చెప్పారు.
 
ఇకపోతే.. విశాఖ కేజీహెచ్‌‌లో అడుగు పెడితే పదవి పోతుందనే ఎప్పటి నుంచో సెంటిమెంట్ ఉందట. గతంలో ఎన్టీఆర్ ఆస్పత్రిలో అడుగు పెట్టి ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారట. అప్పటి నుంచి సీఎంలు, పదవుల్లో ఉన్నవారు అక్కడికి వెళ్లరనే ప్రచారం ఉంది. అంతేకాదు గత ప్రభుత్వంలో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయ్యిందట. 
 
మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ కేజీహెచ్‌కు వెళ్లారట. రాత్రి అక్కడే బస చేశారట.. కొద్దిరోజులకే ఆయన పదవి పోయిందని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. మరి జగన్ పరిస్థితి ఏంటని.. ఆయన పదవి ఏమౌతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు