అల్లం పేస్ట్‌లో తేనె కలిపి మాడుకు పట్టించి...?

గురువారం, 21 మార్చి 2019 (13:03 IST)
చుండ్రును పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చుండ్రును పోగొట్టుకోవచ్చు. జుట్టును ఓ సారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకు మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
 
మాడుకి అయిదు చెంచాల కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది. 
 
రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకు తగిలేలా రాసుకుని 5 నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. ఆ తరువాత కప్పు నీళ్లలో స్పూను నిమ్మరసం వేసి జుట్టకు పట్టించి వదిలేయాలి. నిమ్మలోని ఆమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది. 
 
అల్లం ముక్కని పేస్ట్‌లా చేసి, దానికి కాస్త తేనె కలిపి మాడుకి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకి కారణమైన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. జుట్టుని మృదువుగా మారుస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు