అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు

శనివారం, 22 జులై 2023 (18:58 IST)
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్లు స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 64 స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లు కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి.
 
ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లకు జాక్ పాట్ తప్పదు. ఈ స్టేషన్లను నిరంతరం అభివృద్ధి చేస్తుంటారు. స్టేషన్ యాక్సెస్, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్, సర్క్యులేటింగ్ ఏరియాలు, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వై-ఫై లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
 
ప్రస్తుతం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ ఏపీ, తెలంగాణ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌ పరిధిలోని అనంతపురం, ధర్మవరం జంక్షన్, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నాందేడ్, నెల్లూరు, రాయచూర్, రాజమండ్రి, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి, భీమవరం టౌన్, కడప వంటి ఇతరత్రా స్టేషన్లు ఎంపికయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు