రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు.. రిజర్వ్ బ్యాంక్

గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:16 IST)
రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. గురువారం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమావేశం తర్వాత, ఈ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 
 
ఇప్పటికే అమెరికాలో రెపో రేటు పెంచిన తర్వాత యూకేతో సహా కొన్ని దేశాల్లో రెపో వడ్డీ రేట్లు పెరగడంతో భారత్‌లోనూ రెపో వడ్డీ రేటు పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అయితే రెపో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటించారు. 
 
అలాగే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు 6.5గా కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో రుణాలు తీసుకున్న చాలామంది రిలీఫ్‌గా భావించడం గమనార్హం. రెపో రేటులో మార్పు జరిగితే, రుణంపై వడ్డీ రేట్లు పెరుగుతాయని, అందువల్ల రుణగ్రహీతలు నిరాశకు గురవుతారని గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు