కాగా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇప్పటికే నిషేధం విధించిన వియత్నాం.. యూకేలోని తమ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చిన 15 మందిలో కొత్త వైరస్ లక్షణాలను గుర్తించినట్టు మొన్న టర్కీ ప్రకటించింది. ఐర్లండ్లోనూ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
అటు అమెరికాలో ఇప్పటి వరకు మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ వైరస్ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నారు.
ఇప్పటికే కరోనా వైరస్తో అల్లాడిపోతున్న అమెరికాలో కొత్త వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వైరస్ వెలుగు చూసిన బ్రిటన్లో దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పార్క్లను మూసివేసింది.