దేశంలో 29వ తేదీన కరోనా పాజిటివ్ వైరస్ కేసులు

మంగళవారం, 17 నవంబరు 2020 (10:00 IST)
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 29,164 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,791 మంది కోలుకున్నారు. 
 
గడచిన 24 గంట‌ల సమయంలో 449 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,519 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,90,371 మంది కోలుకున్నారు. 4,53,401 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,65,42,907 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులోనే 8,44,382 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో 952 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,602 మంది కోలుకున్నారు. 
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,58,828కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,43,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,410కి చేరింది. ప్రస్తుతం 13,732 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 11,313 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 68 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు