దేశంలో కరోనా కేసులు పైపైకి... తెలంగాణాలోనూ మారని సీన్

శుక్రవారం, 7 మే 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరుగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు ల‌క్ష‌ల‌కు మించి న‌మోద‌య్యాయి. తాజాగా కొత్త‌గా 4,14,188 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం నిన్న 3,31,507 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 2,14,91,598కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,915 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  2,34,083కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,76,12,351 మంది కోలుకున్నారు. 36,45,164 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,49,73,058 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంట‌ల నుంచి గురువారం రాత్రి 8 గంటల మ‌ధ్య 5,892 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 9,122 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,625గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73,851 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,104 మందికి క‌రోనా సోకింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు