రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. టీడీపీలోకి వస్తారా.. వైకాపాలోకి వెళ్తారా..?

బుధవారం, 7 జూన్ 2023 (10:27 IST)
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో రానున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లోకి వస్తానని అంబటి రాయుడు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు అంబటి రాయుడి స్వగ్రాం. అయితే తండ్రి హైదరాబాదులో స్థిరపడటంతో అక్కడే క్రికెట్ నేర్చుకున్నాడు. 
 
జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రికెటర్‌గా ఎదిగాడు. కానీ క్రికెట్‌లో మెరుగైన ఆటగాడిగా రాణించలేకపోయాడు. త్వరలో రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నట్లు అంబటి రాయుడు ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లోని వైకాపా, టీడీపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. 
 
ఇక అంబటి రాయుడు తాత టీడీపీ తరపున గెలిచి సర్పంచ్‌గా పనిచేసారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లతో అధిష్ఠానం మంతనాలు జరిపిందని తెలుస్తోంది. కానీ రెండు మూడుసార్లు సీఎం జగన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడంతో రాయుడు వైసీపీలోకి వెళ్తారని టాక్ వస్తోంది. 
 
వైకాపా నేతలు రంగంలోకి దిగి గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అంబటికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అంబటి ఏ పార్టీలో చేరుతారనేది ఆయన ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు