చేతులెత్తేసిన భారత బౌలర్లు .. సిమ్మన్స్ వీరవిహారం.. విండీస్ విజయం

సోమవారం, 9 డిశెంబరు 2019 (09:51 IST)
తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు లెండల్ సిమ్మన్స్ బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 1-1 తో సమమైంది. 
 
తొలుత ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసింది. యువ ఆటగాడు శివమ్‌ దూబే అర్థ సెంచరీ(54), రిషభ్‌ పంత్‌ 33 పరుగులతో ఆకట్టుకొని, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును సాధించిపెట్టగా, మిగితా బాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ 15, రాహుల్ 11, దూబే 54, కోహ్లీ 19, పంత్ 33 (నాటౌట్), శ్రేయాస్ 10, జడేజా 9, సుందర్ 0, చాహర్ 1 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆ జట్టులో సమ్మన్ 67 (నాటౌట్), లూయిస్ 40, హెట్‌మయెర్ 23, పూరన్ 38 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
ఫలితంగా 18.3 ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాగా, సిరీస్ ఫలితాలన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు