అసిస్టెంట్ కెమెరామెన్‌ను మోసం చేసిన మహిళా నిర్మాత!!

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (15:32 IST)
హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో ఓ మహిళా సినీ నిర్మాత ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌ను మోసం చేసింది. అతని నుంచి రూ.18.50 లక్షలు నగదు తీసుకుని చివరకు అతనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున  బాబు అనే వ్యక్తి టాలీవుడ్‌లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా కొనసాగుతున్నాడు. ఈయనకు "భైరవపురం" సినిమా షూటింగ్ సమయంలో మహిళా నిర్మాత ఆశ మల్లికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెళ్లివరకు దారితీసింది. అయితే, తనకు వివాహమైందని, భర్తకు విడాకులు ఇస్తానని నాగార్జునను నమ్మించి చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద నాగార్జునను వివాహం చేసుకుంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి అతని నుంచి రూ.18.50 లక్షల నగదును తీసుకుంది. 
 
ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, అడిగితే కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడసాగింది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలిని అనుమానించిన నాగార్జున బాబు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే వివాహమైందని, పిల్లలు లేరన నమ్మించి వివాహం చేసుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలైనట్టు, నకిలీ పత్రాలతో మోసగించి పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత వారిని మోసం చేయడమే వృత్తిగా పెట్టుకుందని తేలింది. 2016లో గాజువాక పోలీస్ స్టేషన్‌లో 2019లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లలో మొదటి, రెండో భర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసులు నమోదైవున్నట్టు విచారణలో తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు